నేడు జిల్లా పరిషత్ సమావేశం
ABN, First Publish Date - 2020-12-22T03:20:37+05:30
మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహిం చనున్నారు.
మహబూబ్నగర్ టౌన్, డిసెంబరు 21: మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహిం చనున్నారు. సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొననున్నారు. కరోనా నియంత్రణ, అభివృద్ధి పనులు, మంజూరైన నిధులు, వరి కొనుగోళ్లు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కరోనా వైరస్ నియంత్రణ గురించి అధికారులు సభ దృష్టికి తేనున్నారు. ఈ పాలక వర్గం అధికారం చేపట్టిన తర్వాత ఈ సమావేశం నాల్గోది కావడంతో అభివృద్ధి పనులపై ప్రజా ప్రతినిధులు ప్రశ్నించే అవకాశం ఉంది. పాలక వర్గంలో అందరూ అధికార పార్టీ సభ్యులే కావడంతో గత సమావేశాల మాదిరిగా ఎలాంటి గొడవలు జరుగకుండా సాఫీగా జరుగనుంది. మండ లాల్లో సమస్యలు అధికంగా ఉండడంతో నిధులు పడుతున్న ఇబ్బందులను సభ్యులు సభ దృష్టికి తేనున్నారు.
Updated Date - 2020-12-22T03:20:37+05:30 IST