లక్ష్య సాధనలో టీఆర్ఎస్ ప్రభుత్వం
ABN, First Publish Date - 2020-06-03T10:01:04+05:30
తెలంగాణ రైతును రాజుగా చేయడమనే లక్ష్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథ్
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథ్
ఇటిక్యాల, జూన్ 2 : తెలంగాణ రైతును రాజుగా చేయడమనే లక్ష్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఇటిక్యాల మండలం కోండేరు గ్రామంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా కోఅర్డినేటర్ కుర్వ పల్లయ్య, మందా శ్రీనాథ్, సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-06-03T10:01:04+05:30 IST