రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి
ABN, First Publish Date - 2020-06-30T11:39:14+05:30
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తక్షణమే భర్తరఫ్ చేయాలని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బ్యాగరి వెంకటస్వామి డిమాండ్ చేశారు
పాలమూరు, జూన్ 29: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తక్షణమే భర్తరఫ్ చేయాలని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బ్యాగరి వెంకటస్వామి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కేసీఆర్ ప్రజల ప్రాణాలను గాలకొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరి ఆడటంలేదని ఓ పేషెంట్ సెల్ఫీ వీడియో కంటతడి పెట్టించిందన్నారు. హోంమంత్రితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకితే వారిని కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చి, రూ.లక్షలతో చికిత్స చేయిస్తున్నారన్నారు. కానీ పేదలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రపతికి లేఖలు రాసే ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-06-30T11:39:14+05:30 IST