ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక తరలింపు జీఓను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2020-07-04T10:56:10+05:30

ఇసుక తరలింపు జీఓను ఉపసంహరించుకోవాలని మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపురం గ్రామ శివారులో గల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లీపురం వంతెనపై రైతుల రాస్తారోకో 


చిన్నచింతకుంట, జూలై 3 : ఇసుక తరలింపు జీఓను ఉపసంహరించుకోవాలని మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపురం గ్రామ శివారులో గల ఊకచెట్టువాగు వంతెనపై రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు.  ఊకచెట్టు వాగు నుంచి ఇసుకను తరలించే జీఓను ఉన్నతాధికారులు వెంటనే ఉపసంహరించుకోవాలని కురుమూర్తి, మద్దూరు, అల్లీపురం గ్రామాలకు చెందిన రైతులు వాగు వంతెనపై గల ఆత్మకూర్‌, హైదరాబాద్‌ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దీక్ష చేసిన రైతులకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు.


ఈ సందర్భంగా రైతు కుర్వ రమేష్‌ మాట్లాడుతూ బండర్‌పల్లి నుంచి కొత్తపల్లి వరకు విస్తరించిన ఊకచెట్టువాగును పూర్తిగా కొల్లగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అధికారులతో కలిసి కుమ్మక్కై ఇసుకను ఇక్కడి నుంచి తరలించేందుకు కుట్రలు చేయటం రైతులను వంచించటమేనని ఆరోపించారు. ఇసుకను తీయడం వల్ల చాలా గ్రామాల్లో తాగు, సాగు నీటి సమస్య ఏర్పడుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి జీఓను రద్దు చేయకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నిరసనను విరమించారు. 

Updated Date - 2020-07-04T10:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising