వ్యవసాయ బిల్లులు రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదు
ABN, First Publish Date - 2020-12-04T04:42:33+05:30
కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల ను ఆశించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవసా య చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు.
- పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన
గద్వాల టౌన్, డిసెంబరు 3 : కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల ను ఆశించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవసా య చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. డిల్లీలో రైతుల ఆందోళనకు మద్ద తుగా గురువారం సీపీఐ ఆధ్వ ర్యంలో కృష్ణవేణి చౌరస్తా వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం కార్మిక నాయకులు బాలగోపాల్ రెడ్డి, గోపాల్ రావు, ఆశన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో పాతబస్టాండ్ చౌరస్తాలో నాయకులు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నరసింహ, రాజు, రఘు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-04T04:42:33+05:30 IST