పనిభారంతో పంచాయతీ కార్యదర్శి రాజీనామా
ABN, First Publish Date - 2020-11-01T08:04:54+05:30
పనిభారం, ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక నారాయణపేట జిల్లా నర్వ మండలం జక్కన్నపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి జేపీఎస్ సమీరొద్దీన్ ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా చేస్తున్నానని శనివారం తోటి కార్యదర్శులతో కలిసి నర్వ
నర్వ, అక్టోబరు 31 : పనిభారం, ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక నారాయణపేట జిల్లా నర్వ మండలం జక్కన్నపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి జేపీఎస్ సమీరొద్దీన్ ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా చేస్తున్నానని శనివారం తోటి కార్యదర్శులతో కలిసి నర్వ ఎంపీడీవో రమేష్ కుమార్కు రాజీనామా పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ హరితహారం మొక్కల లెక్క, మొక్కలను చక్కగా కాపాడాలనే ఒత్తిడికి తట్టుకోలేపోతున్నానని, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం కన్నా గ్రామాల్లో వ్యవసాయం చేసుకోవడమో, ఉపాధి హామీ కూలి పని చేసుకొని బతకడమో మంచిదన్నారు. కార్యదర్శి ఉద్యోగంతో తనపై వత్తిళ్లతో ఆరోగ్యం పాడు చేసుకోవడమే తప్పా వేరే దారిలేదని రాజీనామా చేశానని చెప్పారు.
Updated Date - 2020-11-01T08:04:54+05:30 IST