రైతు సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే అబ్రహాం
ABN, First Publish Date - 2020-02-20T06:23:43+05:30
రైతే రాజు అని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.. తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన బుధవారం అయిజకు వచ్చారు.
అయిజ, ఫిబ్రవరి 19: రైతే రాజు అని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.. తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన బుధవారం అయిజకు వచ్చారు. ముందుగా స్వామి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతీయ స్థాయి పశుబల ప్రదర్శన పోటీల్లో భాగంగా బుధవారం సేద్యపుటెద్దుల విభాగంలో పోటీలను ఆ యన ప్రారంభించారు. పశువుల యజమానులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ముఖ్యమం త్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రైతుబంధు, రైతుబీమా అందిస్తూ రైతులకు అండగా ని లిచారన్నారు. కాగా, సాంప్రదాయ పద్ధతిలో పశువులకు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ దేవన్న, వైస్ చైర్మన్ నర్సింహులు, అలంపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి, పోతుల జనార్దన్రెడ్డి, ఉప్పల ఎంపీటీసీ సభ్యులు ప్రహ్లదరెడ్డి, రవిరెడ్డి, కౌన్సిలర్లు సురేష్, వెంకటేష్, నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్రెడ్డి, భద్రయ్య, నిర్మల్కుమార్, శివకుమార్, సురేష్, జమాలుద్దీన్ పాల్గొన్నారు.
Updated Date - 2020-02-20T06:23:43+05:30 IST