మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
ABN, First Publish Date - 2020-12-14T03:17:43+05:30
భక్తులకు కొంగుబంగారంగా కొ లుస్తున్న నాయినోనిపల్లి మైసమ్మ దేవత దర్శనం కోసం ఈ ఆదివా రం భక్తులు పోటెత్తారు.
మైసమ్మ దేవతను దర్శనం చేసుకుంటున్న భక్తులు
పెద్దకొత్తపల్లి, డిసెంబరు 13: భక్తులకు కొంగుబంగారంగా కొ లుస్తున్న నాయినోనిపల్లి మైసమ్మ దేవత దర్శనం కోసం ఈ ఆదివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా క ర్నూల్, హైదరాబాద్ తదితర ప్రాం తాల నుంచి ఈ ఆదివారం 20 వేలకు పైగా భక్తులు దర్శనం చేసు కొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల నుంచి ఈ ఆదివారం లక్షా 50వేలకు పైనే ఆదాయం వచ్చినట్లు మైసమ్మ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Updated Date - 2020-12-14T03:17:43+05:30 IST