కళాశాలను కొనసాగించాలని మంత్రి ప్రతిపాదనలు
ABN, First Publish Date - 2020-06-28T07:09:12+05:30
గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాలను యథాస్థితిలో కొనసాగించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
గద్వాల, జూన్ 27 ( ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాలను యథాస్థితిలో కొనసాగించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రతిపాదనలు పంపించినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా కళాశాలను కో ఎడ్యుకేషన్ కళాశాలగా మార్చాలని నిర్ణయం తీసుకున్న విషయంపై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృషమోహన్రెడ్డి ఇచ్చిన వినతుల మేరకు మంత్రి సబితకు లేఖలు రాసినట్లు మంత్రి తెలిపారు.
Updated Date - 2020-06-28T07:09:12+05:30 IST