రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2020-12-16T03:53:23+05:30
ద్విచక్ర వాహనం బోల్తా పడి వ్యక్తి మృతి చెం దిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది.
తెలకపల్లి, డిసెంబరు 15 : ద్విచక్ర వాహనం బోల్తా పడి వ్యక్తి మృతి చెం దిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానిక హెడ్కానిస్టేబుల్ జి.వెంకటేశ్వర్లు అందించిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్నముద్దునూర్ గ్రామానికి చెందిన కనుకు లక్ష్మయ్య(65)సోమవారం రాత్రి తన పొలంలో వేసిన వేరుశనగ పంట కావలి కోసం పొలం దగ్గరికి వెళ్తుండగా, గ్రామ శివారులోని శ్రీమాత దేవాలయం దగ్గర ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పి బోల్తా పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వెంటనే ప్రమాదం గమనించిన స్థానికులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు. మంగళవారం మృతుని కుమారుడు కునుకు జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు.
Updated Date - 2020-12-16T03:53:23+05:30 IST