ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలవి వలలు వేస్తే చర్యలు తప్పవు

ABN, First Publish Date - 2020-03-08T07:06:55+05:30

కృష్ణానదిలో నిషేధిత అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తే చర్యలు తప్పవని జిల్లా మత్స్యశాఖ ఏడీ రాధరోహిణి హెచ్చరించారు. శనివారం కొల్లాపూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మత్స్యశాఖ జిల్లా ఏడీ రాధారోహిణి
  • అలవి వలలపై ప్రత్యేక నిఘా ఉంచాం
  • డీఎస్పీ మోహన్‌రెడ్డి

కొల్లాపూర్‌, మార్చి 7 : కృష్ణానదిలో నిషేధిత అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తే చర్యలు తప్పవని జిల్లా మత్స్యశాఖ ఏడీ రాధరోహిణి హెచ్చరించారు. శనివారం కొల్లాపూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో నిషేధిత అలవి వలలపై మత్స్యకారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి కోసం లక్షల సంఖ్యలో చేప పిల్లలను కృష్ణానదిలో వదిలితే మత్స్యకారుల పొట్టకొట్టే విధంగా కొంత మంది అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తున్న ఆంధ్రా దళారులకు తెలంగాణ మత్స్యకారులు సహకరించొద్దన్నారు. డీఎస్పీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నిఘా పెంచామని అలవి వలలతో వేట కొనసాగించకుండా గట్టి బందోబస్తు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మత్స్యశాఖ కార్యదర్శి సత్యనారాయణ, కొల్లాపూర్‌ ఎంపీపీ సుధారాణి, పెంట్లవెల్లి మహేశ్వరి, తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి, ఎస్‌ఐ మురళీగౌడ్‌, పెంట్లవెల్లి ఎస్‌ఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-08T07:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising