గణనీయంగా తగ్గిన కేసులు
ABN, First Publish Date - 2020-12-14T03:25:28+05:30
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో ఆదివారం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
ఆంధ్రజ్యోతి నెట్వర్క్, డిసెంబరు 13 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో ఆదివారం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగిలిన మూడు జిల్లాల్లో 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మహబూబ్నగర్ జిల్లాలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఎనిమిది మందికి వైరస్ సోకింది. నారాయణపేట జిల్లాలో ఒకే ఒక్క కేసు నమోదయ్యింది.
Updated Date - 2020-12-14T03:25:28+05:30 IST