ఘనంగా హనుమాన్ జయంతి
ABN, First Publish Date - 2020-04-09T10:48:07+05:30
హనుమాన్ జయంతి వేడు కలు బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యా ప్తంగా ఘనంగా జరిగాయి
అచ్చంపేట, ఏప్రిల్ 8 : హనుమాన్ జయంతి వేడు కలు బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యా ప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని హనుమాన్ ఆలయాల్లో ఆంజనేయస్వామి కి ఆకుపూజ, అభిషేకాలు నిర్వహించారు. కరోనా నేప థ్యంలో ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశం లేకపోవడంతో వారు అనాథలకు, వృద్ధులకు అన్నదానాలు చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా పదర మండలంలోని మద్దిమ డుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో హోమం చేశారు.
Updated Date - 2020-04-09T10:48:07+05:30 IST