ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2020-12-16T03:40:42+05:30
తమ పేరిట పొలం రిజిస్ర్టేషన్ కావడంలేదని ఇద్దరు రైతులు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు.
- పొలం రిజిస్ట్రేషన్ కావడం లేదని ఆవేదన
మానవపాడు, డిసెంబరు 15: తమ పేరిట పొలం రిజిస్ర్టేషన్ కావడంలేదని ఇద్దరు రైతులు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. చెన్నిపాడుకి చెందిన రాజు, నాగరాజు అనే రైతులు వరుసకు అన్న దమ్ములు. గ్రామంలోని 23గుంటల భూమి తమపేరుపై రిజి స్ర్టేషన్ చేయాలని కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని పురుగులమందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేస్తుండగా అక్కడే ఉన్న అధికారులు జోక్యం చేసుకొని వారికి నచ్చచెప్పారు. ఈ విషయమై ఇన్చార్జి తహసీల్దార్ రవికుమార్ను వివరణ కోరగా సర్వేనంబరు 57లోని ఆస్తి కుటుంబ సభ్యుల పరిధిలో ఉన్నదని, ఇది కోర్టులో తేలాల్సి ఉందని చెప్పారు. కోర్టు ద్వారా పరిష్కారం వచ్చిన వెంటనే భూరిజిస్ర్టేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
Updated Date - 2020-12-16T03:40:42+05:30 IST