కరోనా వార్డుకు డాక్టర్ల నియామకం
ABN, First Publish Date - 2020-08-09T06:32:33+05:30
కరోనా నేపధ్యంలో జోగుళాంబ గద్వాల జిల్లాకు తొమ్మిది మంది డాక్టర్లు నియామకం అయ్యారని, అందులో శనివారం ..
జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా.చందూనాయక్
గద్వాలక్రైం, ఆగస్టు 8: కరోనా నేపధ్యంలో జోగుళాంబ గద్వాల జిల్లాకు తొమ్మిది మంది డాక్టర్లు నియామకం అయ్యారని, అందులో శనివారం నలుగురు డాక్టర్లు విధుల్లోకి చేరినట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా.చందూనాయక్ తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఆసుపత్రిలో కొందరు ప్రభుత్వ డాక్టర్లు కరోనా బారిన పడడంతో కొందరు ప్రైవేట్ డాక్టర్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే శనివారం నలుగురు డాక్టర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు ఇచ్చినట్లు తెలిపారు. వీరిని కరోనా వార్డుకు పంపించడం జరిగిందన్నారు.
Updated Date - 2020-08-09T06:32:33+05:30 IST