పల్లెప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2020-12-04T04:46:40+05:30
పల్లె ప్రకృతి వనాల పనులను త్వరత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రుతిఓఝా అధికారులను ఆదే శించారు.
- జిల్లా కలెక్టర్ శ్రుతిఓఝా
మల్దకల్, డిసెంబరు 3 : పల్లె ప్రకృతి వనాల పనులను త్వరత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రుతిఓఝా అధికారులను ఆదే శించారు. మండలంలోని బిజ్వారం, ఉలిగేపల్లి గ్రామాలలో గురువారం ఆమె పర్యటించారు. రైతువేదికలు, డంపింగ్యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల పనులను ఆమె పరిశీలించారు. ప్రకృతి వనాలలో చెట్లను నాటి రక్షణ ఏర్పాటు చేయాలని అధికారులను, సర్పంచులను ఆదేశించారు. ప్రభుత్వ పనులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు కలెక్టర్ వెంట డీపీఓ కృష్ణ, ఎంపీడీఓ రాజారమేష్, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు ఉన్నారు.
Updated Date - 2020-12-04T04:46:40+05:30 IST