ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

ABN, First Publish Date - 2020-11-22T03:50:04+05:30

పట్టణంలోని పాత జూనియర్‌ కళాశాల నుంచి మదనాపురం మండలం దంతనూర్‌ స్టేజీ వరకు రూ.84 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం భూమి పూజ చేశారు.

దివ్యాంగుడికి స్కూటీని అందిస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కొత్తకోట, నవంబరు 21: పట్టణంలోని పాత జూనియర్‌ కళాశాల నుంచి మదనాపురం మండలం దంతనూర్‌  స్టేజీ వరకు రూ.84 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం భూమి పూజ  చేశారు. రోడ్లు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మహానుభావులు చెప్పినట్లుగా సీఎం కేసీఆర్‌ రోడ్డు పనులకు అడిగిన తక్షణమే నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. పనులు నాణ్యవంతంగా చేయించుకోవాల్సిన బాధ్యత పట్టణ ప్రజలదేనన్నారు. 


దివ్యాంగుడికి ద్విచక్ర వాహనం అందజేత 

పట్టణంలోని 11వ వార్డుకు చెందిన దివ్యాంగుడు ఎండీ మాలిక్‌కు ఎమ్మెల్యే స్వంత ఖర్చులతో స్కూటీ వాహనాన్ని కొనుగోలు చేసి అందించారు. ద్విచక్ర వాహనం ఇప్పించినందుకు  ఎమ్మెల్యేకు మాలిక్‌  కృతజ్ఞతలు తెలిపారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుఖేశిని, వైస్‌ చైర్‌పర్సన్‌ జయమ్మ, ఎంపీపీ గుంత మౌనిక, కౌన్సిలర్లు రాములు యాదవ్‌, కొండారెడ్డి, సంధ్య రవీందర్‌రెడ్డి, మహేశ్వరిరాములు, తిరుపతి, అయ్యన్న, ఖాజామైనోద్దీన్‌, రాంమోహన్‌రెడ్డి , ఆద్వాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-22T03:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising