ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ABN, First Publish Date - 2020-04-21T09:45:59+05:30

లాక్‌డౌన్‌ నిబందనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కట్టడి ప్రాంతాలను పర్యవేక్షించిన ఇన్‌చార్జి ఎస్పీ


గద్వాలక్రైం, ఏప్రిల్‌ 20 : లాక్‌డౌన్‌ నిబందనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని కట్టడి ప్రాంతాలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.


జిల్లాకేంద్రంలోని కట్టడి ప్రాంతాల్లోని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదన్నారు. మోమిన్‌మెహల్లా, వేదనగర్‌, పాతహౌసింగ్‌బోర్డు కాలనీ, భీంనగర్‌, గంజిపేట ఏరియాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు నిత్యావసర సరుకులు అందుతున్నాయా లేదా ఆరా తీసారు. సరుకులు అవసరమైతే వలంటీర్లను సంప్రదించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కృష్ణ, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ హనుమంతు, ఎస్‌ఐ సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - 2020-04-21T09:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising