ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియురాలి సమాధి వద్ద ఉరేసుకున్న ప్రియుడు

ABN, First Publish Date - 2020-10-25T19:14:26+05:30

ఇద్దరు యువ‌తీయువ‌కులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి : ఇద్దరు యువ‌తీయువ‌కులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేకపోయారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనకున్నారు. ఇంతలోనే ప్రియురాలు అనారోగ్యంతో కన్నుమూసింది. తన ప్రాణంలాంటి ప్రియురాలే లేని ఈ లోకంలో ఇక తాను భూమి మీద బతకడం ఎందుకని భావించిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఇరువురి మరణంతో ఆ రెండు కుటుంబాలతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.


మొదట ప్రియురాలు గీతాంజలి అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియుడు మహేష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం నాడు ప్రియురాలి సమాధి వద్దకు వెళ్లిన మహేష్ ఉరేసుకున్నాడు. ఈ ఘటనలతో ఇరు కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-25T19:14:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising