ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓఆర్ఆర్ వద్ద మిర్చి లోడ్‌తో వచ్చిన లారీ మాయం

ABN, First Publish Date - 2020-04-28T16:58:08+05:30

సంగారెడ్డి: పటాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ దగ్గర మిర్చి లోడ్‌తో వచ్చిన లారీ మాయమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: పటాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ దగ్గర మిర్చి లోడ్‌తో వచ్చిన లారీ మాయమైంది. నేటి తెల్లవారుజామున గుంటూరు నుంచి మిర్చీ లోడ్‌తో ఓ లారీ వచ్చింది. దానిని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోయి మెదక్ జిల్లా తూప్రాన్ దగ్గర వదిలేసి పారిపోయారు. మిర్చి లోడ్‌తో లారీ రావడంతో లక్షల్లో డబ్బులుండొచ్చని దొంగలు భావించినట్టు తెలుస్తోంది. అయితే లారీని ఎత్తుకెళ్లింది డ్రైవరా...? దొంగలా..? అనేది తెలియాల్సి ఉంది. లారీ డ్రైవర్ కనిపించకుండా పోవడంతో అతని పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తూప్రాన్‌లో లారీ దొరకడంతో అక్కడికి వెళ్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో జిల్లాలో ఇదే పెద్ద చోరీ కావడంతో పోలీసులు దీనిని సవాల్‌గా తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.


Updated Date - 2020-04-28T16:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising