ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దెపై వేధింపులు.. యజమానులకు కౌన్సిలింగ్

ABN, First Publish Date - 2020-04-21T00:35:22+05:30

లాక్‌డౌన్ వేళ ఇంటి యజమానులు అద్దెదారులను వేధించొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్‌డౌన్ వేళ ఇంటి యజమానులు అద్దెదారులను వేధించొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడారు. రూమ్‌ రెంట్‌ల వేధింపుల విషయంలో ఇప్పటి వరకు డయల్ 100కు 36 కాల్స్ వచ్చాయన్నారు. ఇంటి ఓనర్స్‌ను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు. 


లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఉపాధి కూడా లేకపోవడం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి నగరంలో, ఇతర పట్టణాల్లో అద్దె ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మూడు నెలల పాటు అద్దెదారులెవరూ ఇంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఈ మేరకు ఇంటి యజమానులు అద్దె వసూలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ఇంటి అద్దె గురించి ఇబ్బంది పెడితే 100కు డయల్ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Updated Date - 2020-04-21T00:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising