లద్దాఖ్లో కుమరం భీం జవాన్ మృతి
ABN, First Publish Date - 2020-10-18T10:05:59+05:30
శ్మీర్లోని లద్దాఖ్లో కొండచరియలు విరిగి మీద పడటంతో పడి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు చెందిన జవాన్ షాకీర్ హుస్సేన్ (38) శనివారం ప్రాణాలు కోల్పోయారు.
కాగజ్నగర్, అక్టోబరు 17: కశ్మీర్లోని లద్దాఖ్లో కొండచరియలు విరిగి మీద పడటంతో పడి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు చెందిన జవాన్ షాకీర్ హుస్సేన్ (38) శనివారం ప్రాణాలు కోల్పోయారు. విధులు ముగించుకొని క్యాంపునకు వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుందని అఽధికారులు కుటుంబసభ్యులకు ఫోన్లో తెలిపారు. 2001లో సైన్యంలో చేరిన షాకీర్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Updated Date - 2020-10-18T10:05:59+05:30 IST