అసెట్ ప్రొటెక్షన్ సెల్ టోల్ఫ్రీ నంబర్ ప్రారంభించిన కేటీఆర్
ABN, First Publish Date - 2020-07-05T21:17:07+05:30
హైదరాబాద్లో ఆస్తుల పరిరక్షణకు జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల పరిరక్షణకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
హైదరాబాద్: హైదరాబాద్లో ఆస్తుల పరిరక్షణకు జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల పరిరక్షణకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రగతిభవన్లో అసెట్ ప్రొటెక్షన్ సెల్ టోల్ఫ్రీ నంబర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అసెట్ ప్రొటెక్షన్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 599 0099ను కేటీఆర్ విడుదల చేశారు. నగరంలో ఆస్తుల రక్షణపై టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. చెరువులు, బహిరంగ స్థలాలు, పార్కుల రక్షణపై ఫిర్యాదు చేయాలన్నారు. అన్ని పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు టోల్ఫ్రీ నంబర్ పనిచేస్తుందని, సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కేటీఆర్ చెప్పారు.
Updated Date - 2020-07-05T21:17:07+05:30 IST