పోస్టాఫీస్ సెంటర్ను అంబేద్కర్ కూడలిగా మారుస్తాం
ABN, First Publish Date - 2020-12-12T04:39:05+05:30
కొ త్తగూడెంలోని ప్రధాన కేంద్రమైన పోస్టాఫీస్ సెంటర్ను అంబేద్కర్ సెంటర్గా నామకరణ చేస్తామని ఎమ్మెల్యే వన మా వెంకటేశ్వరరావు ప్రకటించారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, డిసెంబరు 11 : కొ త్తగూడెంలోని ప్రధాన కేంద్రమైన పోస్టాఫీస్ సెంటర్ను అంబేద్కర్ సెంటర్గా నామకరణ చేస్తామని ఎమ్మెల్యే వన మా వెంకటేశ్వరరావు ప్రకటించారు. శుక్రవారం అంబేద్కర్ సెంటర్లోగల అంబేద్కర్ విగ్రహం వద్ద వాటర్ ఫౌంటేషన్ భూమి పూజను నిర్వహించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బీఆర్. అంబేద్కర్ పేరున జిల్లాలోని అతి పెద్ద ప్రధాన కేంద్రంగా పేరుగడించిన పోస్టాఫీస్ సెం టర్కు ఆయన పేరును పెడుతున్నామని చెప్పారు. అంబే ద్కర్ సెంటర్గా మారుస్తూ.... త్వరలో ప్రజాప్రతినిధుల సమక్షంలో తీర్మాణంచేసి అధికారికంగా ప్రకటిస్తామని, ఈ సెంటర్ను ఉమ్మడి జిల్లాలోని అతి ముఖ్యమైన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మునిసిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ, టీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్లు వేణుగోపాల్, నర సింహా, పరమేష్, దళిత సంఘ నాయకులు మందా హన్మంతు, కూసపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T04:39:05+05:30 IST