ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రానైట్‌ వ్యాపారి హత్య

ABN, First Publish Date - 2020-11-24T04:04:44+05:30

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ గ్రానైట్‌ వ్యాపారి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో దారుణహత్యకు గురయ్యాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్‌ వ్యాపారి వెనిశెట్టి రంగనాథ్‌(40)గా గుర్తించారు.

ఘటన ప్రదేశంలో రంగనాథ్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సూర్యాపేట జిల్లా అనంతగిరిలో ఘటన

ఖమ్మానికి చెందిన వెనిశెట్టి రంగనాథ్‌గా గుర్తించిన పోలీసులు 

అనంతగిరి, నవంబరు 23 : ఖమ్మం జిల్లాకు చెందిన ఓ గ్రానైట్‌ వ్యాపారి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో దారుణహత్యకు గురయ్యాడు. కోదాడ ఇన్‌చార్జి డీఎస్పీ మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం అనంతగిరి నుంచి శాంతినగర్‌ వెళ్లే మార్గంలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ నిర్వహించి, మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్‌ వ్యాపారి వెనిశెట్టి రంగనాథ్‌(40)గా గుర్తించారు. తలపై రాయితో బలంగా మోదడంతో మృతి చెందాడని భావిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం నుంచి వ్యాపార నిమిత్తం 1987లో ఖమ్మం పట్టణానికి వచ్చిన రంగనాథ్‌ గ్రానైట్‌ వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడని ఆయన తెలిపారు. మృతిపై పలు అనుమానాలు ఉండటంతో సూర్యాపేట క్లూస్‌టీంను రంగంలోకి దించి వివరాలు సేకరించామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన అన్నారు. మృతుడు రంగనాథ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు బాలాజీ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-11-24T04:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising