దూరదర్శన్లో విద్యార్థులకు పాఠాలు
ABN, First Publish Date - 2020-07-06T10:35:40+05:30
సాంఘీక సంక్షేమ విద్యాసంస్థ దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా ఆన్లైన్ పాఠాలను సోమవారం నుంచి ప్రసారం చేస్తున్నట్టు కొత్తగూడెం తెలంగాణ
ఖానాపురంహవేలి, జూలై5: సాంఘీక సంక్షేమ విద్యాసంస్థ దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా ఆన్లైన్ పాఠాలను సోమవారం నుంచి ప్రసారం చేస్తున్నట్టు కొత్తగూడెం తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్. వెంకటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటినుంచి 18వరకు డిగ్రీ, 21నుంచి 31 వరకు ఇంటర్, ఆగస్టు 3 నుంచి 11వరకు పాఠశాల విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో రోజూ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2 గంటల వరకు బోధన జరుగుతుందన్నారు.
Updated Date - 2020-07-06T10:35:40+05:30 IST