ఖమ్మం అత్యాచారం, దాడి కేసులో బాలిక మృతి
ABN, First Publish Date - 2020-10-16T12:18:46+05:30
అత్యాచారానికి గురైన ఖమ్మం బాలిక మృతి చెందింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పదమూడేళ్ల బాలిక మృత్యువాతపడింది.
ఖమ్మం: అత్యాచారానికి గురైన ఖమ్మం బాలిక మృతి చెందింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పదమూడేళ్ల బాలిక మృత్యువాతపడింది. గత నెలలో బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాలికను ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. బాలిక పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Updated Date - 2020-10-16T12:18:46+05:30 IST