కారేపల్లిలో దొంగ అరెస్టు
ABN, First Publish Date - 2020-12-05T05:07:55+05:30
కారేపల్లి మండలంతో పాటు కామేపల్లి, గార్ల, టేకులపల్లి మండలాల్లో 5సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తున్న కారేపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన పునెం రాజును శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు.
19తులాల బంగారం స్వాఽధీనం
కారేపల్లి డిసెంబరు 4: కారేపల్లి మండలంతో పాటు కామేపల్లి, గార్ల, టేకులపల్లి మండలాల్లో 5సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తున్న కారేపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన పునెం రాజును శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. కారేపల్లి పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి మాట్లాడుతూ ద్విచక్రవాహనంపై సంచరిస్తూ దొంగతనాలు చేస్తుంటాడని తెలపారు. ఇప్పటికి 12 దొంగతనాలు చేసిన్నట్లు ఏసీపీ తెలిపారు. రాజును గతంలో పోలీసులు మూడుసార్లు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం పెట్రోల్ బంకు సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ టి.సురేష్, కారేపల్లి రూరల్ సీఐ శ్రీనువాసులు, సీసీఎస్ సీఐ రవి, కామేపల్లి ఎస్ఐ స్రవంతి పోలీసు సిబ్బందిని సీపీ తప్సీర్ ఇక్భాల్ అభినందించారు. త్వరలోనే రివార్డులు అందజేయనున్నట్టు ఏసీపీ తెలిపారు.
Updated Date - 2020-12-05T05:07:55+05:30 IST