ద్విచక్రవాహనాల దొంగల అరెస్టు
ABN, First Publish Date - 2020-11-25T05:00:36+05:30
ఖమ్మం నగర పరిధిలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఖానాపురంహవేలి పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు.
ఖమ్మంక్రైం, నవంబరు 24: ఖమ్మం నగర పరిధిలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఖానాపురంహవేలి పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. ఖానాపురానికి చెందిన ఏపూరి చంద్రశేఖర్, కూసుమంచి మండలం గట్టుసింగారానికి చెందిన దాచేపల్లి హనుమారెడ్డి కొంతకాలంగా ఖమ్మం వన్టౌన్, టుటౌన్, హవేలి పోలీసుస్టేషన్ల పరిధిలో 9 ద్విచక్రవాహనాలను చోరికి పాల్పడ్డారు. పలుకేసులను కూసుమంచి పోలీసులు సహకారంతో విచారిస్తుండగా ద్విచక్రవాహనాల చోరికి పాల్పడుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరికి పాల్పడినట్టు ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద ఉన్న 9 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని వారిని ఖానాపురంహవేలి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈకేసుకు సహకరించిన కూసుమంచి పోలీసులను, ఖానాపురంహవేలి సీఐ వెంకన్నబాబును, సిబ్బందిని ఏడీసీపీ మురళీధర్, ఏసీపీ ఆంజనేయులు అభినందించారు.
Updated Date - 2020-11-25T05:00:36+05:30 IST