రైతును రాజు చేయడమే కేసీఆర్ ధ్యేయం
ABN, First Publish Date - 2020-05-14T06:11:51+05:30
రైతును రాజు చేయడమే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని
దంతాలపల్లి, మే 13: రైతును రాజు చేయడమే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గంలో ఎస్సారెస్పీ పనులను పూర్తి చేయించి సాగునీటిని విడుదల చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వలాద్రి ఉమ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ మల్లారెడ్డి, ఆగ్రోస్ సెంటర్ నిర్వాహకుడు దామోదర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వేణు, తహసీల్దార్ గౌరీశంకర్, ఎంపీడీవో గోవిందరావు, సర్పంచ్ సుష్మిత, ఎంపీటీసీ యాకన్న, రఘునందన్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Updated Date - 2020-05-14T06:11:51+05:30 IST