కేసీఆర్ కిట్ల పంపిణీలో గోల్మాల్
ABN, First Publish Date - 2020-09-24T11:53:03+05:30
సీఆర్ కిట్స్ ఇప్పిస్తానంటూ గర్భిణుల నుంచి డబ్బులు వసూలు చేసిన
హైదరాబాద్/వనస్థలిపురం : కేసీఆర్ కిట్స్ ఇప్పిస్తానంటూ గర్భిణుల నుంచి డబ్బులు వసూలు చేసిన వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి ఔట్సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురానికి చెందిన సతీష్ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొంతకాలంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు కేసీఆర్ కిట్లు ఇప్పిస్తానంటూ నమ్మబలికి 138మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఒక్కో గర్భిణి నుంచి రూ.వెయ్యితోపాటు మీ సేవా చార్జీల పేరిట మరికొంత వసూలు చేశాడు.
మొత్తంగా నిందితుడు రూ.లక్షా 50వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి రెడ్వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రంగా చేసుకుని ఈ దందా నడిపించాడు. అయితే వనస్థలిపురానికి చెందిన శంకర్ ఈ విషయాన్ని ఆస్పత్రి సూపరిటెండెంట్ హరిప్రియకు ఫిర్యాదు చేశారు. సూపరింటెండెంట్ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అతడి నుంచి మీ సేవ సంబంధించి కాగితాలు, ల్యాప్ట్యాప్, ప్రింటర్తో పాటు రూ.50వేలు స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2020-09-24T11:53:03+05:30 IST