ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావాళ్లను వెనక్కి రప్పించండి.. ప్రభుత్వానికి జనగామ వాసులు విజ్ఞప్తి

ABN, First Publish Date - 2020-03-26T19:21:12+05:30

కాశీ పుణ్యక్షేత్రంలో జనగామ జిల్లా వాసులు చిక్కుకున్నారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం కోసం వెళ్లిన వీళ్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: కాశీ పుణ్యక్షేత్రంలో జనగామ జిల్లా వాసులు చిక్కుకున్నారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం కోసం వెళ్లిన వీళ్లు.. లాక్‌డౌన్‌ ప్రకటనతో అక్కడే ఉండిపోయారు. ఎటూ వెళ్లే పరిస్థితి లేక కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 16న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాదాద్రి, హైదరాబాద్, జనగామ తదితర ప్రాంతాలకు చెందిన 60 మంది కాశీ యాత్రకు వెళ్లారు. వీరిలో జనగామకు చెందిన 20 మంది భక్తులు ఉన్నారు.


కరోనా మహమ్మారి ఎఫెక్టుతో దేశం మొత్తం లాక్ డౌన్ కావడంతో వీరి ట్రైన్ టికెట్లు రద్దయ్యాయి. దీంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం వీరు కాశీలోని లష్కర్ రోడ్డు టెంపుల్ వీధి జస్ట్ లుక్ హోటల్‌లో ఉంటున్నారు. పోలీసులు అడుగు బయటపెట్టనివ్వకపోవడంతో.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాశీకి వెళ్ళిన బృందంలో ఎక్కువగా 60 ఏళ్లు నిండిన వృద్ధులు ఉన్నారు. నాలుగు రోజులుగా బందీలుగా ఉన్న నేపథ్యంలో.. వారు అస్వస్థతకు గురైతే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కాశీలో ఉన్న భక్తులను వెనక్కి రప్పించాలని వేడుకుంటున్నారు. 

Updated Date - 2020-03-26T19:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising