ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో మరో రెండు కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-07-06T10:42:45+05:30

జిల్లాలో ఆదివారం మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వారం రోజులుగా జిల్లాలో వరుసగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుభాష్‌నగర్‌, జూలై 5: జిల్లాలో ఆదివారం మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వారం రోజులుగా జిల్లాలో వరుసగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 147 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని పద్మశాలి వీధికి చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది అతని నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సమాచారం. నగరంలోని వావిలాలపల్లికి చెందిన మరో వ్యక్తి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోగా అతనికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది. 


కొనసాగుతున్నస్ర్కీనింగ్‌ 

హుజూరాబాద్‌ రూరల్‌: కరోనా సోకిన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది స్ర్కీనింగ్‌ పరీక్షలు కొనసాగుతున్నాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌రెడ్డి తెలిపారు. హుజూరాబాద్‌ కాకతీయ కాలనీ, సాయిబాబా ఆలయం, చాకలి వాడలో 280మందికి, హుజూరాబాద్‌ మండలం కందుగుల గ్రామంలో 202, జమ్మికుంట మండలం ధర్మారం, వావిలాల, కొత్తపల్లిలలో 521 మందికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

Updated Date - 2020-07-06T10:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising