పారిశుధ్య కార్మికుల శ్రమను గుర్తించాలి
ABN, First Publish Date - 2020-05-16T10:10:25+05:30
పట్టణ, గ్రామీణ పారిశుధ్య కార్మికుల శ్రమను గుర్తించాలని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు.
సిరిసిల్ల టౌన్, మే 15: పట్టణ, గ్రామీణ పారిశుధ్య కార్మికుల శ్రమను గుర్తించాలని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు. శుక్రారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 17వ బెటాలియన్ ఎస్పీ అలెక్స్ వితరణగా అందజేసిన నిత్యావసరాలను పంపిణీ చేశారు. 17వ బెటాలియన్ ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. కమిషనర్ సమ్మయ్య, బెటాలియన్ ఏఎస్పీ పెద్దబాబు పాల్గొన్నారు.
Updated Date - 2020-05-16T10:10:25+05:30 IST