ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-11-13T10:13:18+05:30

జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివ వీధిలో గురువారం రాత్రి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగిత్యాల పట్టణంలోని శివవీధికి చెందిన గంజి రాంబాబు(49), లావణ్య(47) అనే దంపతులు ముంబాయిలో ఓయాడ్‌ ఏజెన్సీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల టౌన్‌, నవంబరు 12: జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివ వీధిలో గురువారం రాత్రి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగిత్యాల పట్టణంలోని శివవీధికి చెందిన గంజి రాంబాబు(49), లావణ్య(47) అనే దంపతులు ముంబాయిలో ఓయాడ్‌ ఏజెన్సీలో పని చేస్తున్నారు. అయితే రాంబాబు తండ్రి రాజేశం ఎనిమిది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి రాంబాబు దంప తులు జగిత్యాలకు వచ్చి ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం దంపతులకు కరోనా పాసిటివ్‌ వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. 20 రోజుల క్రితం రాంబాబు సోదరి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  వీరు గురువారం తమ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రాత్రి రాంబాబు స్నేహితులు అతనికి  ఫోన్‌ చేసినా స్పందించక పోవడంతో ఇంటికి వచ్చి చూసే వరకు దంపతులు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.  వీరికి వివాహమై 25 ఏళ్లు గడుస్తున్నా సంతానం లేదు. ఏ కారణాల వల్ల దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న విషయం తేలాల్సి ఉంది.  జగిత్యాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-13T10:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising