ముంబై నుంచి వచ్చి.. 27 ఏళ్ల భార్య, 20 ఏళ్ల మరదలితో హోం క్వారంటైన్లో ఉండగా..
ABN, First Publish Date - 2020-06-04T18:03:54+05:30
జిల్లాలో బుధవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరు ముంబై నుంచి...
జగిత్యాల: జిల్లాలో బుధవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరు ముంబై నుంచి జిల్లాకు వచ్చారు. బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ముంబై నుంచి తన 27 సంవత్సరాల భార్య, 20 సంవత్సరాల మరదలితో కలిసి స్వగ్రామానికి వచ్చి హోం క్వారంటైన్లో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో ముగ్గురిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. మిగతా ఇద్దరికి పరీక్షలు నిర్వహించడంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పాజిటివ్ వచ్చింది.
జిల్లాలో 70 మందికి పాజిటివ్ రాగా ఇందులో 66 మంది వలస కూలీలున్నారు. ఇదిలా ఉంటే.. మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన వాసాల దేవదాస్(52) సౌదీలో కరోనాతో మృతి చెందాడు. దేవదాస్ 15 సంవత్సరాల నుంచి సౌదీలోని ఓ ప్రైవేటు కంపెనీలో టైలరింగ్ పనులు చేస్తున్నాడు.
Updated Date - 2020-06-04T18:03:54+05:30 IST