ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శానిటేషన్‌ సిబ్బందికి సలాం

ABN, First Publish Date - 2020-03-23T10:52:24+05:30

కరోనా మహమ్మారితో దేశమంతా వణికి పోతుంటే పారిశుధ్య కార్మికులు మాత్రం ప్రాణాలకు తెగించి నివారణ చర్యల్లో భాగస్వాములవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌సిటీ, మార్చి 22: కరోనా మహమ్మారితో దేశమంతా వణికి పోతుంటే పారిశుధ్య కార్మికులు మాత్రం ప్రాణాలకు తెగించి నివారణ చర్యల్లో భాగస్వాములవుతున్నారు. దీంతో పలువురు వారికి సలాం అని ప్రశంసిస్తున్నారు. ఆదివారం జనమంతా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యులయ్యారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. రోడ్లుపై మనిషి కనిపించని పరిస్థితి ఏర్పడింది.


ఇదే సమయంలో రామగుండం పారిశుధ్య కార్మికులకు అత్యవసర సిబ్బందిగా విధులు నిర్వహించారు. 15 బృందాలుగా ఏర్పడి నిత్యం జన సంచారం ఉండే ప్రాంతాల్లో యాంటీ వైరస్‌ ద్రావణాన్ని స్ర్పే చేశారు. రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌, బస్‌ షెల్టర్లు, వైన్‌షాపులు, టిఫిన్‌ సెంటర్లు, మెయిన్‌ చౌరస్తా, పార్కులు, అంగడి ప్రాంతాల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని స్ర్పే చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి సేవలు కొనసాగాయి. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 50డివిజన్లలో సేవలు అందించేందుకు 50 స్ర్పే పంపులు తెప్పించారు. సోమవారం నుంచి నిరంతరంగా స్ర్పే కొనసాగించనున్నారు. 

Updated Date - 2020-03-23T10:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising