రైతు వేదిక పనులు అడ్డుకున్న గ్రామస్థులు
ABN, First Publish Date - 2020-08-02T10:13:39+05:30
రైతు వేదిక పనులు అడ్డుకున్న గ్రామస్థులు
రాయికల్, ఆగస్టు 1: మండలంలోని మైతాపూర్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను గ్రామస్థులు శనివారం అడ్డుకున్నారు. వేదిక నిర్మాణం కోసం తవ్విన గుంతలను పూడ్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు వేదిక ప్రభుత్వ భూమిలో నిర్మించాలన్నారు. కానీ గ్రామంలో 11కుల సంఘాలు కలిసి కొనుగోలు చేసిన భూమిలో నిర్మించడం సరికాదని అన్నారు. తాము కొనుగోలు చేసిన భూమిపై తీర్మానం చేసే హక్కు గ్రామపంచాయతీకి లేదని ఇప్పటికైనా పనులు ఆపి ప్రభుత్వ భూమిలో రైతు వేదిక నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5వందల మంది గ్రామస్థులు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-02T10:13:39+05:30 IST