ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైలారం రైతులు భూసేకరణకు సహకరించాలి

ABN, First Publish Date - 2020-06-06T10:24:20+05:30

మైలారం రైతులు కాల్వల నిర్మాణానికి భూసేకరణకు సహకరించాలని కలెక్టర్‌ శశాంక, ఎమ్మెల్యే రసమయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ శశాంక


గన్నేరువరం జూన్‌ 5; మైలారం రైతులు కాల్వల నిర్మాణానికి భూసేకరణకు సహకరించాలని కలెక్టర్‌ శశాంక, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు గుండ్లపల్లి, గునుకులకొండాపూర్‌, జంగపల్లి, మాదాపూర్‌లో పర్యటించి కాలువలను, చెరువులను పరిశీలించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను పరిశీలించారు.


మైలారం గ్రామంలో సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి గ్రామాలకు కాల్వల ద్వారా నీరు రావడానికి రైతుల నుంచి భూసేకరణ కోసం చర్చించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ గ్రామంలో రైతులు ముందుకు వచ్చి 45 ఎకరాల భూములు ఇస్తున్నారని అన్నారు. భూములు కోల్పోవుతున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం కింద ఎకరానికి రూ.9 లక్షలు ఇస్తుందని తెలిపారు. టమాటా రైతులకు ప్రాసెసింగ్‌ యూనిట్‌, గొర్రెల కాపరులకు ఊరు బయటి షెడ్ల నిర్మాణాలను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్‌ గుడెల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T10:24:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising