అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అమలు చేయాలి
ABN, First Publish Date - 2020-12-28T04:27:07+05:30
chamdi yagam in karimnagar
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్
వైభవంగా ఛండీయాగం
కరీంనగర్ కల్చరల్, నవంబరు 27: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన వెనుకబడిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ను రాష్ట్రప్రభుత్వం అమలు చేయాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్లోని వాసవీకన్య కాపరమేశ్వరి ఆలయంలో వైశ్యకార్పొరే షన్ ఈడబ్ల్యూఎస్ అమలుకై చేపట్టిన ఛండీయాగానికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరై పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మోదీ రెండేళ్ల క్రితం అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తేరాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఛండీయాగం చేపట్టడం అభినంద నీయమన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఆర్యవైశ్యకార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చేయలేదని విమర్శించారు. రాబోయే 2023ఎన్నికల్లో బీజేపీ గెలిచి కార్పొరేషన్కు 100కోట్లు కేటాయించి పేద అగ్రవర్ణాలకు రిజర్వేషన్ అమలు చేసి తీరు తామని తెలిపారు. తాము ముస్లిం రిజర్వేషన్కు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. 150 పేద మహిళలకు చీరల పంపిణీతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, గుగ్గిళ్లపురమేశ్, కార్పొరేటర్ కొలిపాక అంజయ్య పాల్గొన్నారు.
Updated Date - 2020-12-28T04:27:07+05:30 IST