ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ పెరిగిన చికెన్‌ ధర

ABN, First Publish Date - 2020-05-18T10:27:00+05:30

నగరంలో చికెన్‌ ధర ఒక్కసారిగా పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందు చికెన్‌ తింటే కరోనా వస్తుందన్న భయంతో ఎవరూ చికెన్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కిలో చికెన్‌ రూ.320


సుభాష్‌నగర్‌, మే 17: నగరంలో చికెన్‌ ధర ఒక్కసారిగా పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందు చికెన్‌ తింటే కరోనా వస్తుందన్న భయంతో ఎవరూ చికెన్‌ కొనకపోవడంతో చికెన్‌ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. లాక్‌డౌన్‌ ముందు వరకు కిలో చికెన్‌ 50రూపాయలు ఉండేది. చికెన్‌ తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడడంతో ప్రజలు చికెన్‌ కొనడం క్రమక్రమంగా పెరిగింది.


అయితే కూరగాయలతో పాటు మటన్‌, చికెన్‌ను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఎప్పడికప్పుడు పర్యవేక్షించారు. అయితే కొద్ది రోజుల నుంచి చికెన్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారం నాడు ఏకంగా కిలో చికెన్‌ రూ.320లకు పెరిగింది. దీనితో ప్రజలు చికెన్‌ను కొనేందుకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై అధికారులు దృష్టిసారించి ధరలను అదుపులో ఉంచేలా ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-05-18T10:27:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising