లాక్డౌన్పై క్షేత్రస్థాయి పరిశీలన
ABN, First Publish Date - 2020-04-10T11:06:17+05:30
లాక్డౌన్ కర్ఫ్యూ అమలుతీరును కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డి క్షేత్రస్థాయిలో
నిరంతరం పర్యవేక్షిస్తున్న పోలీసు కమిషనర్
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 9 : లాక్డౌన్ కర్ఫ్యూ అమలుతీరును కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ వాహనం, డ్రోన్ కెమెరాలతో ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితి పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. డ్రోన్కెమెరా ద్వారా గుంపులుగా ఉండే ప్రాంతాలను పరిశీలిస్తూ వారిని చెదరగొట్టేందుకు స్థానిక బ్లూకోల్ట్స్ పోలీసులకు సూచనలు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా కరీంనగర్లోని మహీంద్రా మోటార్లైన్ సంస్థ పోలీసుల కోసం సానిటైజర్లను సంస్థ డైరెక్టర్ సునీల్ కోకిల వాని ఆదేశాల మేరకు స్థానిక బ్రాంచి మేనేజర్ వడ్లూరి రాజు కరీంనగర్ పోలీసు కమిషనర్కు అందజేశారు.
Updated Date - 2020-04-10T11:06:17+05:30 IST