ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు చట్టపరిధిలో మెలగాలి

ABN, First Publish Date - 2020-11-25T05:28:53+05:30

నిషేధిత వ్యాపారాలపై పోలీస్‌ శాఖ ఉక్కు పాదం మోపుతుందని, ప్రజలు చట్ట పరిధిలో మెలగాలని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీ కమలాసన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీ కమలాసన్‌రెడ్డి

హుజూరాబాద్‌ రూరల్‌, నవంబరు 24: నిషేధిత వ్యాపారాలపై పోలీస్‌ శాఖ ఉక్కు పాదం మోపుతుందని, ప్రజలు చట్ట పరిధిలో మెలగాలని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌ పట్టణ శివారులోని ఏసీపీ కార్యాలయంలో రెండు గుంటల స్థలంలో ఏర్పాటు చేసిన ఫిష్‌పాండ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం అక్రమ రవాణాపై ప్రభుత్వ నిషేధిత గుట్కా, అంబర్‌ ప్యాకెట్ల వ్యాపారాలపై, ఇసుక రవాణ, పీడీఎస్‌ బియ్యం దందాపై పోలీస్‌ శాఖ ఉక్కు పాదం మోపుతుందన్నారు. ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని సూచించారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని హుజూరాబాద్‌ డివిజన్‌ ఒక ప్రత్యేక స్థానంలో ఉందన్నారు. నేరాల నివారణపై పోలీస్‌ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం హర్షనీయమన్నారు. నేరాలు తగ్గుముఖం పడుతున్నా యన్నారు. క్షణికావేశాలకు లోనై ఎవరు నేరాలకు పాల్పడవద్దని సూచించారు. యువత చెడు వ్యసనాలకు గురికావద్దన్నారు. అనంతరం కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు, సీఐలు మాధవి, కిరణ్‌, సృజన్‌రెడ్డి, రాములుతో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-11-25T05:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising