కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాల ఆందోళన
ABN, First Publish Date - 2020-08-10T10:33:09+05:30
దేశవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట ఆది వారం అన్ని కార్మిక, ప్రజాసంఘాలు జైల్భరో కార్యక్రమాన్ని నిర్వహించాయి.
సుభాష్నగర్, ఆగస్టు 9: దేశవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట ఆది వారం అన్ని కార్మిక, ప్రజాసంఘాలు జైల్భరో కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనావల్ల అరెస్టులు జరగలేని పరిస్థితి దేశంలో ఉందన్నారు. దేశవ్యాప్తంగా గతనెల 17నుంచి ఆగస్టు 9వరకుప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పులేదని అన్నారు. అందుకే క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో సేవ్ ఇండియా పేరుతో జైల్బరో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.
Updated Date - 2020-08-10T10:33:09+05:30 IST