ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల ఆకలి తెలిసిన ముఖ్యమంత్రి

ABN, First Publish Date - 2020-07-06T10:44:49+05:30

పేదల ఆకలి తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌


కరీంనగర్‌ రూరల్‌, జులై 5: పేదల ఆకలి తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం చర్లబూత్కూర్‌ గ్రామంలో ఉచితరేషన్‌బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా ఉండేందుకు తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ పదికిలోలు ఉచితంగా బియ్యాన్ని ఐదు నెలల పాటు అందిస్తామన్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై 266కోట్ల అదనపు భార పడుతుందన్నారు. కేంద్రం కోటి 91లక్షల మందికి మాత్రమే బియ్యం సరఫరా చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 88 లక్షల మందిని కలిపి 2కోట్ల 80లక్షల మందికి బియ్యం అందిస్తోందన్నారు. మొత్తం 2.80కోట్ల మందికి లబ్ధిచేకూరనుందన్నారు. అనంతరం హరితాహారంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు.

Updated Date - 2020-07-06T10:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising