సమ్మె విజయవంతానికి సీఐటీయూ బైక్ర్యాలీ
ABN, First Publish Date - 2020-11-25T05:26:47+05:30
ఈ నెల 26న నిర్వహించతలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు.
భగత్నగర్, నవంబర్ 24: ఈ నెల 26న నిర్వహించతలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భం గా సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశావ్యాప్తంగా అన్ని రకా ల కార్మికులు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేస్తున్న సమ్మెను విజయవంతం చేయా లన్నారు. ఎన్టీఆర్ చౌక్ నుండి నగర వీధుల గుండా గీతభవన్ వరకు బైక్ల పై నినాదాలు చేస్తూ సిఐటియు కార్య కర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఐఎంఎల్ డిపో అధ్యక్షుడు తిరు పతి, రాజేశం, శ్రీనివాస్, చంద్రారెడ్డి, ఇ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-25T05:26:47+05:30 IST