ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ నేతల జలదీక్షలు.. నక్కల సంతాప సభలు: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-06-03T20:21:26+05:30

హైదరాబాద్: కాంగ్రెస్ నేతల జలదీక్షలు, ధర్నాలు నక్కల సంతాప సభల్లా ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాంగ్రెస్ నేతల జలదీక్షలు, ధర్నాలు నక్కల సంతాప సభల్లా ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ నాయకులేనని... మళ్లీ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ధర్నాలు, దీక్షల పేరుతో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ద్రోహులుగా మిగిలారని జగదీష్‌రెడ్డి విమర్శించారు.


నల్గొండ కాంగ్రెస్ నాయకుల చేతకానితనం వల్లనే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పోతిరెడ్డిపాడు పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ నాయకులదేనన్నారు. జానారెడ్డి, ఉత్తమ్,  కోమటిరెడ్డిలు సీమాంధ్ర నాయకుల వద్ద మొకరిల్లి నల్గొండ జిల్లాను ఎండబెట్టారన్నారు. కాంగ్రెస్ నాయకులు ద్వంద వైఖరిని విడనాడాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.







Updated Date - 2020-06-03T20:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising