ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం ఘాట్‌ రోడ్డు లోయలో పడిన వ్యాను

ABN, First Publish Date - 2020-09-23T10:11:05+05:30

నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం ఘాట్‌ రోడ్డులోని లోయలో మంగళవారం రాత్రి వ్యాన్‌ బోల్తాపడి పలువురు గాయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడుగురికి తీవ్రమైన గాయాలు  వారంతా ధూల్‌పేటవాసులు


నాగర్‌కర్నూల్‌/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 22 : నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం ఘాట్‌ రోడ్డులోని లోయలో మంగళవారం రాత్రి వ్యాన్‌ బోల్తాపడి పలువురు గాయ పడ్డారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేటకు చెందిన తొమ్మిది మంది ఓ వ్యాన్‌లో శ్రీశైలం వెళ్తుండగా ఈగలపెంట దాటిన తర్వాత 20 అడుగుల లోయలో పడింది. వాహనంలో ఉన్న వారిలో ఏడుగురికి తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఈగలపెంట జెన్‌కో ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పోచయ్య తెలిపారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డ వారిలో ఒకరితో ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఫోన్‌లో రాత్రి పొద్దుపోయిన తర్వాత మాట్లాడగలిగారు. మొత్తం 15 మంది దైవదర్శనానికి వెళ్లినట్లు ఓ బాధితుడు(26) తెలిపాడు. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంవల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు చెప్పాడు. అంబులెన్స్‌లో నలుగురు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి చేరుకున్నట్లు కూడా పేర్కొన్నాడు

Updated Date - 2020-09-23T10:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising