ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా ఆర్థిక స్వావలంబనతోనే దేశ ప్రగతి

ABN, First Publish Date - 2020-09-24T09:07:05+05:30

మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు కృషి చేయాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ తమిళిసై


బేగంపేట, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు కృషి చేయాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. బుధవారం రాజ్‌భవన్‌ పరివార్‌ మహిళలకు రాజ్‌భవన్‌ కమ్యూనిటీహాల్‌లో ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాన్ని గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు సంపాదించిన ప్రతి పైసా కుటుంబ సంక్షేమానికి ఖర్చు చేస్తారన్నారు. మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో స్వయం ఉపాధి శిక్షణ పొంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితోనే రాజ్‌భవన్‌ పరివార్‌ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ప్రారంభించడం జరిగిందన్నారు. అంతకుముందు మహిళా పారిశ్రామిక వేత్తలు తయారుచేసి ప్రదర్శనగా ఉంచిన పీపీఈ కిట్స్‌, పర్యావరణ హితమైన హ్యాండీ క్రాఫ్ట్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ సెక్రటరీ శ్రీదేవి, డైరెక్టర్లు పల్లవీజోషి, మాధవి, గవర్నర్‌ సెక్రటరీ కె.సురేంద్ర మోహన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T09:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising