ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రిలో చేరిన మంత్రి కేటీఆర్‌ కుమారుడు!

ABN, First Publish Date - 2020-10-01T13:43:37+05:30

సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు కాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వివరాల్లోకెళితే.. హిమాన్షు కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న హిమాన్షును బుధవారం రాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. ఆ గాయంతో కనీసం నిలబడలేక బాధపడుతున్నట్లు తెలియవచ్చింది. దీంతో వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించి సీటీ స్కాన్‌ చేయించారని తెలిసింది. ఈ స్కానింగ్‌లో తుంటి భాగం, మోకాలికి తీవ్రగాయం అయినట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం. కాగా.. ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో హిమాన్షుకు ఇలా గాయమైనట్లు సెక్యూరిటీ సిబ్బంది ద్వారా సమాచారం తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-01T13:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising